ఏపీలో ఆ ఉద్యోగులకు గుడ్న్యూస్..! ప్రమోషన్తో పాటుగా నెలకు జీతం పెంపు..!
Mon May 19, 2025 12:02 Politics
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం దిశగా అడుగుల వేస్తోంది. మినీ అంగన్వాడీలను మెయిన్ అంగన్వాడీలుగా మార్చేందుకు సిద్ధమవుతోంది. దీనికి సంబంధించిన ప్రతిపాదనలను సిద్ధం చేసింది. మంగళవారం జరిగే కేబినెట్ సమావేశంలో దీనిపై నిర్ణయం తీసుకోనున్నారు. దీనివల్ల మినీ అంగన్వాడీ కార్యకర్తలకు జీతం పెరుగుతుంది. అలాగే అంగన్వాడీ కేంద్రాల పనితీరు మెరుగుపడుతుంది. అయితే మెయిన్ అంగన్వాడీ కేంద్రాల్లో పనిచేసే కార్యకర్తలు పదో తరగతి పాసై ఉండాలి. ఈ నిబంధనను మినీ అంగన్వాడీలకు కూడా వర్తింపజేయనున్నారు. ఇప్పటికే మినీ అంగన్వాడీ కేంద్రాల్లో పనిచేస్తున్న వారిలో పది పాసైన వారిని మెయిన్ అంగన్వాడీలుగా మారుస్తారు. ఇలా రాష్ట్రవ్యాప్తంగా 4,600 మంది వరకు ఉన్నారని అధికారులు అంచనా వేశారు.
ప్రస్తుతం మినీ అంగన్వాడీ కార్యకర్తలకు నెలకు రూ.7 వేలు జీతం ఉంది.. మెయిన్ అంగన్వాడీ కార్యకర్తగా మారితే రూ.11,500 జీతం లభిస్తుంది. అంటే ఒక్కొక్కరికి నెలకు రూ.4,500 జీతం పెరుగుతుంది. దీనివల్ల ప్రభుత్వంపై ఏటా రూ.25 కోట్ల అదనపు భారం పడుతుంది. రాష్ట్రంలో మొత్తం 55,700 అంగన్వాడీ కేంద్రాలు ఉంటే.. వాటిలో 6,837 మినీ అంగన్వాడీ కేంద్రాలు ఉన్నాయి. మెయిన్ అంగన్వాడీ కేంద్రంలో కార్యకర్త, ఆయా ఉంటారు. మినీ అంగన్వాడీ కేంద్రంలో కేవలం కార్యకర్త మాత్రమే ఉంటారు. గర్భిణులు, బాలింతలు, పిల్లలకు సేవలు అందించడానికి ఈ కేంద్రాలు ఉపయోగపడతాయి.
ప్రస్తుతం మినీ అంగన్వాడీల్లో 200 వరకు ఖాళీలు ఉన్నాయి.. 4,600 మినీ కేంద్రాల్లో పనిచేస్తున్న వారు పదో తరగతి పాసయ్యారు. మిగిలిన చోట్ల పనిచేస్తున్న వారికి పదో తరగతి పాసయ్యేందుకు ఒక ఏడాది లేదా రెండేళ్ల గడువు ఇస్తారు. ఆ లోపు అర్హత సాధించిన వారిని మెయిన్ అంగన్వాడీలుగా మారుస్తారు. మినీ అంగన్వాడీ కేంద్రాల్లో దాదాపు 300 చోట్ల ఐదుగురి కంటే తక్కువ లబ్ధిదారులు ఉన్నారు. గిరిజన ప్రాంతాలు, ఎస్సీ, ఎస్టీ కాలనీల్లో ఉన్న వాటిని మాత్రం మార్చరు. మిగిలిన వాటిని హేతుబద్ధీకరించాలని ప్రతిపాదించారు. అంటే తక్కువ మంది లబ్ధిదారులు ఉన్న కేంద్రాలను దగ్గరలోని ఇతర కేంద్రాలతో కలపవచ్చు. దీనిపై మంత్రివర్గం నిర్ణయం తీసుకుంటుంది.
ఇది కూడా చదవండి: ఏపీలో పేదలకు పండగే.. ఈ పథకం కింద ఒక్కొక్కరికి రూ.2.50లక్షలు! దరఖాస్తు చేసుకోండి!
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
ఆర్టీసీ బస్సులో ప్రయాణించిన మంత్రి, మేయర్ విజయలక్ష్మి.. సౌకర్యాలపై ఆరా!
ముంబైలో హై అలెర్ట్.. విమానాశ్రయం, తాజ్ హోటల్కు బాంబు బెదిరింపులు..
ఎన్నారైలకు షాక్! యూఎస్ నుంచి సొమ్ము పంపితే అదనపు భారం!
వైసీపీకి దిమ్మతిరిగే షాక్.. వల్లభనేని వంశీపై మరో కేసు! ఇక పర్మినెంట్ గా జైల్లోనేనా.?
ఈ-పాస్పోర్ట్ వచ్చేసింది! విదేశాంగ శాఖ కీలక నిర్ణయం!
లోకేశ్ తాజాగా కీలక సూచనలు.. అందరూ అలా చేయండి! అమ్మ లాంటి పార్టీని మరచిపోవద్దు!
మెగా డీఎస్సీ గడువు పొడగింపుపై మంత్రి లోకేష్ కీలక వ్యాఖ్యలు..! అభ్యర్థులకు ఊహించని..!
ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. అతి తక్కువ ధరకే ఫైబర్ నెట్.. ఆ వివరాలు మీకోసం!
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:
#andhrapravasi #APEmployees #SalaryHike #PromotionAlert #GoodNews #AndhraPradesh #EmployeeWelfare
Copyright © 2016 - 20 | Website Design & Developed By : www.andhrapravasi.com
andhrapravasi try to report accurately, we can’t verify the absolute facts of everything posted. Postings may contain fact, speculation or rumor. We find images from the Web that are believed to belong in the public domain. If any stories or images that appear on the site are in violation of copyright law, please email [andhrapravasi@andhrapravasi.com] and we will remove the offending information as soon as possible.